Tuesday, April 30, 2024

Breaking | ఎస్​బీఐ ఏటీఎంను బద్దలుకొట్టి.. 12లక్షలు దోచుకెళ్లారు!

నిజామాబాద్​ జిల్లాలో ఎస్​బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. మెండోరా మండలం పోచంపాడ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏటీఎంను ధ్వంసంచేసిన దుండగులు నగదును కాజేశారు. ఎస్ బి ఐ బ్యాంక్ ఏటీఎం ను గ్యాస్ కట్టర్ తో కోసి దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం వద్ద ఉన్న సీసీ కెమెరాలను దొంగతనం చేయడానికి ముందు అగంతకులు ధ్వంసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు డాగ్ స్క్యాడ్ క్లూస్ టీం లను రంగంలోకి దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement