Friday, April 26, 2024

తేనెటీగల దాడిలో… ఒకరు మృతి

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదుళ్ళపల్లి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన కోన్ రెడ్డి సంజీవ(45), కోన్ రెడ్డి జనార్దన్(42) ఇద్దరు అన్నదమ్ములపై తేనెటీగలు దాడిచేశాయి. తేనెటీగల దాడి నుండి తప్పించుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలో అన్నదమ్ములు దూకారు. అన్న కోన్ రెడ్డి సంజీవకు ఈత రాకపోవడంతో మృతిచెందాడు. ఈత వచ్చిన తమ్ముడు జనార్దన్ ప్రాణాలతో బయటపడినాడు. కోన్ రెడ్డి సంజీవ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement