Sunday, April 28, 2024

Tweet | కేసీఆర్‌పై పోటీకి బండి సంజ‌య్‌, విజ‌య‌శాంతి.. పార్టీ ఆదేశిస్తే నిల‌బ‌డ‌తాం: విజ‌య‌శాంతి

తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీకి నిల‌బ‌డుతామ‌ని బీజేపీ నాయకురాలు రాముల‌మ్మ (విజయశాంతి) సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాకపోయినా, పార్టీ ఆదేశిస్తే అందుకు రెడీగా ఉన్న‌ట్టు చెప్పారు. తాను మొదటి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీపై దృష్టి పెడుతున్నాన‌ని, అయితే వచ్చే ఎన్నికల్లో తనను కామారెడ్డి నుంచి, బండి సంజయ్‌ని గజ్వేల్ నుంచి పోటీ చేయాల‌ని కార్యకర్తలు అడుగుతున్నారని, అందులో సమస్య ఏమీ లేదన్నారు. ఈ మేరకు రాముల‌మ్మ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

బీఆర్ఎస్‌పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని.. అందుకే గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి తాను కేసీఆర్‌పై పోటీ చెయ్యాలని కార్య‌క‌ర్త‌ల అడ‌గ‌డంలో త‌ప్పేమీ లేద‌న్నారు. చివరలో హరహర మహాదేవ, విజయశాంతి అంటూ ట్వీట్ ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement