Sunday, April 28, 2024

Sangareddy: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణు శ్రీ (18) అనే యువతి ఇవాళ సాయంత్రం బలవన్మరణానికి పాల్పడింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్య చేసుకుంటుండగా తోటి విద్యార్ధులు వీడియో తీయగా.. వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. యాజమాన్యంతోనూ మాట్లాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement