Monday, May 6, 2024

ప్ర‌జా రవాణాను మ‌రింత మెరుగుప‌రిచేందుకే ఆర్టీసీ విలీనం – పువ్వాడ

ఖమ్మం: రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌ రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ చారిత్రాత్మ‌క నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మున్నేరు RCC కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ 150 కోట్లు మంజూరు,, ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం బిల్లు అసెంబ్లీలో ఆమోదం అనంతరం మొదటి సారి ఖమ్మం విచ్చేసిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మున్నేరు బ్రిడ్జి వద్ద భారీ సంఖ్యలో మున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసి ఉద్యోగులు, BRS శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ, 43 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి ఎప్పటికి రుణపడి ఉండాలని కోరారు. ఖమ్మం మున్నేరు పై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరు అయ్యాయని, ఇప్పుడు తాజాగా పేదలను మున్నేరు వరద ముంపు నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి నివేదించగా తక్షణమే రూ.150 కోట్లు మంజూరు చేసి క్యాబినెట్ లో పేట్టి అమోదించుకున్నామని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమంలో BRS ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదని, కేవలం ప్రజల సంక్షేమం మాత్రమే ఆశిస్తున్నదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement