Wednesday, May 1, 2024

TS : పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు….త‌ప్పిన ప్ర‌మాదం..

వ‌రంగ‌ల్ జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న చెన్నారావుపేట మండల పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెన్నారావుపేట నుంచి తిమ్మిరాయిని పహాడ్‌కు వెళ్తోంది.

ఈ క్రమంలో స్టీరింగ్‌కు ఉన్న బోల్డ్ ఊడిరావడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన డ్రైవర్ బస్సును అదుపు చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement