Friday, May 3, 2024

Bus Accident:  హైవేపైఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

జాతీయ ర‌హ‌దారిపై ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బొల్తా కొట్టింది. డివైడర్ ఢీ కొట్టి రోడ్డుకు అవతలివైపుకు దూసుకెళ్లింది. దీంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్లతో పాటు మొత్తం 20 మంది గాయపడ్డారు. హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

షాద్ నగర్ మీదుగా హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ కు గురైంది. ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. రోడ్డుపై బస్సు బోల్తా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా.. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement