Friday, May 17, 2024

కిన్నెర మొగిల‌య్య‌కు రూ. కోటి న‌గ‌దు, హైద‌రాబాద్‌లో ఇల్లు.. ఉత్త‌ర్వులు జారీచేసిన తెలంగాణ ప్ర‌భుత్వం

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత, కిన్నెర మెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిల‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల‌ న‌గ‌దు పుర‌స్కారాన్ని మంజూరు చేస్తూ ఇవ్వాల ఉత్త‌ర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బీఎన్ రెడ్డి నగర్‌లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మొగిలయ్య క‌లిసిన విష‌యం విదిత‌మే. ద‌ర్శ‌నం మొగిలయ్య ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement