Monday, April 29, 2024

Route map :మూడో రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణలో బీజేపీ పార్టీని బలపర్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టారు బండి సంజయ్. మొదటి రెండు రోజులు ప్రజసంగ్రామ యాత్ర అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. రెండో రోజు గోల్కొండ కోట దగ్గర బహిరంగసభ నిర్వహించారు.. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఇవాళ సంజయ్‌ పాదయాత్ర మూడో రోజుకు చేరుకోగా.. తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్, ఆరే మైసమ్మ దర్శనం తర్వాత సభ నిర్వహించి లంచ్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు.. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్‌నగర్‌ వరకు పాదయాత్ర సాగనుండా.. ఈ రోజు మొత్తంగా 13 కిలోమీట్ల మేర పాదయాత్ర నడుస్తారు.. హిమాయత్‌నగర్‌లో రాత్రి బస చేయనున్న బండి సంజయ్‌.. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

ఇది కూడా చదవండి: అధ్యక్ష పదవి రావడంలో ఆయనది కీలక పాత్ర: రేవంత్ రెడ్డి..

Advertisement

తాజా వార్తలు

Advertisement