Friday, May 3, 2024

TS: జ‌గిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ..విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. మెట్ పల్లి మండలం వెంకటరావుపేట వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు కొద్దిసేపు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement