Sunday, April 28, 2024

RIP – ప‌ద్మ‌శాలి సంఘం నేత రామ శ్రీనివాస్ క‌న్నుమూత … నివాళుల‌ర్పించిన కెటిఆర్, హ‌రీష్ రావు..

హైదరాబాద్‌ : వరంగల్‌కు చెందిన ప్రముఖ సంఘ సేవకుడు, తెలంగాణా పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడ యశోద దవాఖానలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ )‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ భవన్ నుంచి హుటాహుటిన సోమాజిగూడ ఆయ‌న నివాసానికి వెళ్లారు..అక్క‌డ శ్రీనివాస్ భౌతికకాయంపై పూల‌మాల‌లు ఉంచి నివాళులు అర్పించారు.

కాగా, శ్రీనివాస్‌ మోక్షారామా ఫౌండేషన్ పేరుతో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మ ఒడి పేరుతో అనాథలు, వృద్ధులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌ రావు స్మరించుకున్నారు. పలు సేవా కార్యక్రమాలలో ముందు వుండే శ్రీనివాస్ అని నిత్యం పద్మశాలి సమాజ శ్రేయస్సు కోసం తపించే వారు అని , శ్రీనివాస్ మరణం పద్మశాలి సమాజానికె కాదు యావత్ తెలంగాణ కి తీరని నష్టం అని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement