Thursday, April 25, 2024

TS : గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు నోటిపికేష‌న్ విడుద‌ల

రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబా పూలే సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆర్‌డీసీ సెట్‌-2024 ను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 12 లోపు ఆన్‌లైన్‌ విధానంలో తమ అప్లికేషన్లను అందజేయాలి.

- Advertisement -

అనంతరం హాల్‌ టికెట్ల డిస్ట్రిబ్యూషన్ ఏప్రిల్‌ 21 నుంచి వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు. పూర్తి వివరాలకు విద్యార్థులు https://tswreis.ac.in/ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 24న ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు..
ప్రవేశ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుందని, ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజీలో ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగా ప్రశ్నాపత్రం ఉండనుంది. ఈ పరీక్షలో సీటు పొందిన విద్యార్థులకు ఎలాంటి రుసుము ఉండదు. అయితే, కనీసం 50 శాతం మార్కులతో 2024 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement