Monday, April 29, 2024

Kamareddy: తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో బీజేపీదే గెలుపు.. వెంకటరమణారెడ్డి

వికారాబాద్, ఫిబ్రవరి 21 (ప్రభ న్యూస్): రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని 17స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని అనంతగిరి హరిత రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ సదానంద రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ కౌన్సిలర్ శ్రీదేవి, నాయకులు శిరీష లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు..

రాబోయే రోజుల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాండుగౌడ్, శ్రీధర్ రెడ్డి, పోకల సతీష్, రాములు, బసవలింగం గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement