Thursday, April 25, 2024

ఎన్టీఆర్ కు టిడిపి నాయ‌కులు.. ఘన నివాళి

వికారాబాద్ మే 28 (ప్రభ న్యూస్): తెలుగుదేశం వ్యవస్థాప‌కులు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వికారాబాద్ నియోజకవర్గ టిడిపి కన్వీనర్ దివాకర్ నేతృతంలో తెలుగుదేశం నాయకులు పూలమాలవేసి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. నియోజకవర్గ కన్వీనర్ దివాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల లో చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.. రాజకీయ చేయడం తీసుకువచ్చి ప్రతి పౌరుడికి ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించిన మహోన్నత వ్యక్తి అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఆంధ్ర ..తెలంగాణలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం. నాయకులు పాపిరెడ్డి పాండు యాదవ్ ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement