Friday, May 3, 2024

TS: చిల్కూర్ బాలాజీని దర్శించుకున్న తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. శనివారం మొయినాబాద్ మండలంలోని బాలాజీ దేవాలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బాలాజీ దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు షాబాద్ దర్శన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మిలి మాణయ్య, మండల సహకార సంఘం చైర్మన్ చంద్రరెడ్డి, మాజీ సర్పంచ్ వీరభద్రప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్మిడి వెంకట్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ రైతు సంఘం ఉపాధ్యక్షులు కేబుల్ రాజు, కార్యదర్శి పి.శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ రైతు సంఘం అధ్యక్షులు బొక్క వెంకట్ రెడ్డి, నాయకులు పి కుమార్ యాదవ్, అనంత రెడ్డి, శ్రీశైలం, నరసింహ, పి.కుమార్, ధనరాజు, నరేందర్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, రాజు, నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement