Sunday, May 5, 2024

RR: సుభాష్ నగర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ ప్రచారం

వికారాబాద్, నవంబర్ 16 (ప్రభ న్యూస్): సుభాష్ నగర్ కూరగాయల మార్కెట్లో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మండల రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ప్రసాద్ కుమార్ తప్పనిసరిగా గెలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, నాయకులు గుడిసె లక్ష్మణ్, మైనార్టీ సెల్ వికారాబాద్ పట్టణ మైనార్టీ సెల్ కార్యదర్శి ఎండి ముస్తాక్, నాయకులు గురుపంతులు కృష్ణ, దేవి మాజీ కౌన్సిలర్ రాములమ్మ, నాయకులు శివానందం, ఆనందం, మేనక, పల్లవి, తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement