Monday, May 6, 2024

వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుపై ఎంపీ రంజిత్ రెడ్డి హ‌ర్షం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవడం పట్ల చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ రద్దు భారతదేశ రైతాంగ విజయమ‌న్నారు. అట్లాగే గత ఐదు నెలలుగా చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి రైతు పోరాటానికి నిదర్శనమే ఈ విజయం అన్నారు. ఈ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఇదే నిజమైన నివాళి అన్నారు. జై కిసాన్ అన్న నినాదాన్ని రైతులు మరోసారి తాము లేనిదే దేశం లేదని నిరూపించారన్నారు. సీఎం కేసీఆర్ నిన్నటి ధర్నా కూడా ఈ చట్టాల రద్దు విషయంలో ముఖ్య పాత్ర పోషించిందన్నారు. మరోసారి ఈ విజయానికి కారకులైన రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement