Wednesday, May 15, 2024

బుద్ధ ధ్యాన మహా పిరమిడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు మంచిరెడ్డి , అంజ‌య్య యాద‌వ్

యాచారం, జూలై (15): రంగారెడ్డి జిల్లా – ఇబ్రహీంపట్నం నియోజకవర్గం – యాచారం మండలం పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామంలో శనివారం రోజు బ్రహ్మర్షి పితామహులు శుభాష్ పత్రీజి మార్గదర్శకత్వంలో నిర్మించిన “బుద్ధమహా ధ్యాన పిరమిడ్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ పాల్గొన్నారు.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ప్రతి ఒక్కరూ ప్రతీ నిత్యం ఉదయం కొంత సమయం ఆరోగ్యం కోసం సమయం కేటాయించి ఏకాగ్రతతో ధ్యానం చెయ్యాలని కోరారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివ ప్రసాద్, గ్రామ సర్పంచ్ వన్నవాడ అరుణ పాండు రంగారెడ్డి, ఉప సర్పంచ్ వరప్రసాద్ తదతరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement