Monday, April 29, 2024

బోనాల వేడుక‌ల‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మన్సూరాబాద్ డివిజన్ పరిధి ప్రభుత్వ పాఠశాల సమీపంలోని శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయం లో కాటమయ్యా బోనాల ఉత్సవాలను గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు . అనంత‌రం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాటమయ్యా స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిమీద ఉండాలని కోరారు .బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి శ్రీధర్ గౌడ్ ముద్ద కళ్యాణ్,సభ్యులు శ్రీధర్ గౌడ్,మల్లేష్ గౌడ్,శ్రీనివాస్,జగదీష్,నరేష్,రాజేందర్,నర్సింహాగౌడ్,జైరాజ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement