Thursday, April 25, 2024

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు క‌ల్యాణ ల‌క్ష్మీ వ‌రం : మంత్రి మ‌ల్లారెడ్డి

పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు క‌ల్యాణ ల‌క్ష్మీ ఓ వ‌ర‌మ‌ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ లోని మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మల్లారెడ్డి షాదీ ముభారక్…కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఘట్కేసర్ మండలంలో 41, ఘట్కేసర్ మున్సిపాలిటీ ప‌రిధిలో 33, పోచారం మున్సిపాలిటీ ప‌రిధిలో 22 మంజూరైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పావని జంగయ్య యాదవ్, కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్లు మాధవరెడ్డి, రెడ్యానాయక్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, పార్టీ అధ్యక్షులు రమేష్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement