Saturday, April 27, 2024

రైతుబంధు దేశానికే ఆద‌ర్శం : ఎమ్మెల్యే యాద‌య్య‌

రైతుబంధు దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఇల్లు షాబాద్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా కకులూరు గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… రైతు బంధు ఇచ్చి ఆదుకుంటున్నార‌న్నారు. రైతుబంధుతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నార‌న్నారు. ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల్లోని రైతులు ట్రాక్ట‌ర్ల‌పై, ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించి ఘనంగా రైతు వేదిక సంబరాలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement