Friday, April 26, 2024

సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కు..

మేడ్చల్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలు లబ్ది పొందుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో మేడ్చల్‌ మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన సుధ రూ. 14వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మంత్రి మల్లారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పేదలకు భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమని కొనియడారు. నిరుపేదలకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హమీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్‌ నడిగొప్పు ఉమా నాగరాజు, మేడ్చల్‌ మాజీ ఉపసర్పంచ్‌ నర్సింహారెడ్డి, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ మేడ్చల్‌ మున్సిపల్‌ అధ్యక్షులు శేఖర్‌గౌడ్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు శ్రావణ్‌ గుప్తా, పానుగంటి రవి, మోహాన్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement