Sunday, April 28, 2024

TS : 5సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి… దేవదాస్

వికారాబాద్, మార్చి 3 (ప్రభ న్యూస్): ఐదు సంవత్సరాలకు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వికారాబాద్ జిల్లా దళిత మేధావుల ఫోరం అధ్యక్షులు నాసన్పల్లి దేవదాస్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత దేశంగా రూపొందించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement