Wednesday, May 1, 2024

National : 4 గంటలు యువకుడికి నరకం…ఐస్‌పై పడుకోబెట్టి మూత్ర విసర్జన

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో హేయమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడ కరైరాలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని ఐస్ పై పడుకోబెట్టి దారుణంగా కొట్టారు. ముఖంపై మూత్ర విసర్జన చేశారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగింది. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.

కరైరా పట్టణానికి చెందిన రైతు సాగర్ (28) జనవరి 29న కరైరాలోని ముంగావాలి కూడలి వద్ద నిలబడి ఉన్నట్లు ఫిర్యాదు దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆ తర్వాత ధర్మేంద్ర యాదవ్, ఆకాష్ యాదవ్, సౌరభ్ యాదవ్, బ్రజేంద్ర యాదవ్ కారులో వచ్చారు. పాత వివాదం కారణంగా వ్యక్తులు అతన్ని బలవంతంగా కారులో కూర్చోబెట్టి, కరోతా గ్రామంలోని ఆకాష్ యాదవ్ ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు. కారులోనే అతడిపై దాడి జరిగింది. అయితే అతన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లిన తర్వాత అందరూ అతని పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించారు.

- Advertisement -

అతడిని ఐస్ పై పడుకోబెట్టి 4 గంటల పాటు కొట్టారు. అంతేకాదు నిందితుడు ముఖంపై మూత్రం పోశారు. అనంతరం రాత్రి 2 గంటల ప్రాంతంలో అతడిని కారులో ఎక్కించుకుని ముంగావలి తీరా వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. బాధితుడి సాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన అంతా విన్న పోలీసులు సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement