Wednesday, May 8, 2024

RR: సిమెంట్ లారీ ఢీకొని.. యువకుడు దుర్మరణం

సిమెంట్ లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మొయినాబాద్ మండల కేంద్రంలోని రాధాస్వామి సత్సంగ్ ఆపోజిట్ హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో మొయినాబాద్ నుండి నగరానికి బయలుదేరుతున్న విజ్ఞానేశ్వర్ చారి (19)ని వెనుక నుండి సిమెంట్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు మృతిచెందాడు. మృతుని గ్రామం చేవెళ్ల మండలంలోని దేవరంపల్లి గ్రామం.

Advertisement

తాజా వార్తలు

Advertisement