Friday, May 3, 2024

TS : రామ‌య్య ఫోటో తీశారు…కేసు న‌మోదు చేశారు

మాజీ ఎంపీ, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న అజ్మీరా సీతారాంనాయక్‌పై భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యుంది. శనివారం భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చిన ఆయన స్వామి వారిని దర్శించుకుంటుండగా, ఆయన అనుచరులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇది వైరల్ కావడంతో, నిబంధనలకు విరుద్ధంగా మూలవిరాట్‌ల ఫొటోస్ తియ్యడమే కాకుండా, సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు రామాలయం ఈ ఓ రమాదేవి శనివారం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీంతో ఫొటోస్ తియ్యడానికి కారకులుగా భావించి పోలీసులు నేడు సీతారం నాయక్‌పై కేసునమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement