Monday, May 6, 2024

TS : బీఆర్ఎస్‌పై రాహుల్ గాంధీ కీల‌క వాఖ్య‌లు…కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎం..

ప్రజా సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ చేశార‌ని ఆరోపించారు. బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement