Sunday, May 19, 2024

పివి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ సిటీ, ఆగస్టు ( ప్రభ న్యూస్)7: – నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి )చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివినరసింహారావు కొడుకు పివి ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమం త్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, పివినరసిం హారావు కొడుకు పివి ప్రభాకర్, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిలు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ డబ్ల్యూ సి డి సి చైర్మన్ ఆకుల లలిత , ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు సుదంలక్ష్మి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకురాలు మాజీ కార్పొరేటర్ చాంగు భాయ్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు అధ్యక్షులు కిరణ్ కుమార్, దేశముఖ్,గౌరవ అధ్యక్షులు: కంజర్ కర్ భూపతిరావ్ , ప్రధాన కార్యదర్శి రొట్టె సురేష్ శర్మ, కోశాధికారి రమేష్ కులకర్ణి (పుల్కల్), ఉపాధ్యక్షులు కరుణశ్రీ, ఉదయ్, శశికాంత్, పురుషోత్తం ఆధ్యా త్మిక సలహాదారు వేలేటి గౌరీశంకర్ శర్మ,కార్యనిర్వాహక కార్యదర్శులు: విశ్వనాథ్ రావ్ కులకర్ణి, రాజకాంత్ రావు కులకర్ణి , మల్లికార్జున రావు మంజుల,గౌరవ సలహాదారులు అప్పాల కిష్టయ్య, ప్రాణేశ్వర్ రావు, జగపతి రావు, చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులు మేడిచర్ల శ్రీనాథ్, ప్రకాష్ కులకర్ణి ,గోవిందరావు దేశ్ ముక్, పురుషోత్తం, సౌమ్య భరద్వాజ్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement