Wednesday, May 1, 2024

TS | ప్రమాదాల నివారణే పోలీసుల‌ ధ్యేయం.. వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు ముమ్మరం చేయడంతో పాటు భద్రత ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి. రంగనాథ్ అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య , జనగాం కలెక్టర్ శివలింగయ్యలతో పాటు రవాణా, పోలీసు, నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, మునిసిపల్, ఆర్టీసీ శాఖల అధికారులతో రోడ్డు భద్రతా సమావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. మూడు జిల్లాలోని పలు రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లాస్థాయి కమిటీలు, ఆయా శాఖల ద్వారా మరింతగా పటిష్టంగా ప్రణాళిక బద్దంగా చర్యలు రూపొందించాలని పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement