Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో.. మొక్క‌లు నాటిన‌ ప్ర‌కాశ్ అంబేద్క‌ర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్క‌లు నాటారు రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ మ‌న‌వ‌డు ప్రకాశ్‌ అంబేద్కర్‌.. హైదరాబాద్‌లోని బేగంపేటలో మొక్కను నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త , రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్, బీసీ సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్ , ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో కలిసి ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌ అంబేద్కర్‌ మాట్లాడుతూ.. తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బీఆర్‌.అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు ..మనుషుల్లో సమానత్వం, ప్రకృతి సమతూల్యత కోసం పరితపించిన అంబేద్కర్ జ‌యంతి రోజున మొక్కను నాటడం సంతోషంగా ఉందన్నారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని కోరార‌ని. మొక్కలు నాటడం పట్ల వారికి అమితమైన ఆసక్తి ఉండేదని. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చూస్తున్నాన‌న్నారు. మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ కృషి అనితరసాధ్యమైనద‌న్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ’ లిమ్కాబుక్ లో చేరడం ఆనందం కలిగించింది. వారి కృషికి మరింత గుర్తింపు రావాలి. ప్రకృతి పచ్చదనంతో పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ప్రకాశ్‌ అంబేద్కర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement