Sunday, April 28, 2024

Blame | తప్పడు కథనాలతో సోషల్ మీడియాలో పోస్టులు.. ఎస్పీకీ ఫిర్యాదు చేస్తాన‌న్న జెడ్పీ చైర్​పర్సన్​

గద్వాల ప్రతినిధి, (ప్రభ న్యూస్): కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తాను డ‌బ్బులు ఇచ్చానని.. అబద్ధపు విషయాన్ని సోషల్​ మీడియాలో సర్య్కులేట్ చేస్తున్నారని గద్వాల జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసకుంటానని చెప్పారు.

సోషల్​ మీడియాలో కొంతమంది కావాలని చేస్తున్న పోస్టుల‌పై జెడ్పీ చైర్​పర్సన్​ స‌రిత స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కించపరుస్తూ ఓ ఆడియో క్రియేట్ చేశార‌ని, దాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేసి వైర‌ల్ చేస్తున్నార‌ని తెలిపారు. ఎవరైతే తప్పుడు ఆడియోని సోషల్ మీడియాలో ప్రచారం చేశారో వారిపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకునేలా కేసు న‌మోదు చేస్తాన‌ని చెప్పారు. దీనికి సంబంధించి త‌న వ‌ద్ద పూర్తి ఆధారాలున్నాయని, ఈ విష‌య‌మై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement