Wednesday, May 1, 2024

పొంగులేటితో ఈటల బృందం భేటి – బిజెపిలోకి ఆహ్వానం

ఖమ్మం : రాష్ట్ర బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ నాయకత్వంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం ఖమ్మంలోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో భేటి అయ్యారు..పొంగులేటి కార్యాలయానికి వచ్చిన ఈటల బృందానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అనుచరగణం ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మీయ విందు భోజనం చేస్తూ రాష్ట్ర జిల్లా రాజకీయాలపై చర్చించారు. ఈ క్రమంలో బిజెపిలోకి రావాలని ఈటెల రాజేందర్.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలు , నాయకులతో సందడి నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డిసిసిబి డైరెక్టర్లు తుల్లూరు బ్రహ్మయ్య, మేకల మల్లి బాబు యాదవ్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా వెంకటేశ్వర్లు, క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement