Saturday, May 18, 2024

TS: కొత్తగూడెంలో పొంగులేటి మార్నింగ్ వాక్

కొత్తగూడెం : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్ తో సందడి చేశారు. యువకులు, పిల్లలతో సరదాగా కాసేపు గడిపారు.

వాకర్స్ తో మాట్లాడుతూ…. పిల్లలతో ఆటలాడుతూ… సుమారు రెండు గంటలపాటు కాలక్షేపం చేశారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాగానే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా పొంగులేటి వాకర్స్ తో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement