Monday, May 20, 2024

TS | ఎల్లారెడ్డిలో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు..

ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని కొందరు వడ్డీ వ్యాపారులు ఫైనాన్స్ నడిపేవారు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గురువారం ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్, ఎస్సై బొజ్జ మహేష్ పలు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించారు.

దాడుల్లో ప్రామిసరీ నోట్లు ,బ్యాంకు చెక్కులు నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 36 లక్షలు నగదును సీజ్ చేసినట్లు, ఒకరిపై కేసు నమోదు చేసినట్టు, పలు ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. విచారణ నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని తదుపరి చర్యలు నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement