Tuesday, May 7, 2024

TS | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మేడిపల్లి సత్యం గెలిచిన నాటి నుంచే నియోజకవర్గంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనునిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద కలిగితే నేనున్నాను.. అంటూ ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు.

ఇటీవల చొప్పదండి నియోజకవర్గంలోని కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు నరేష్ శరణ్య నాలుగు నెలల చిన్నారి ధన్విక గుండె జబ్బుతో బాధపడుతోందని తెలియగానే ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు సాయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా మిగిలిన చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇక‌ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా గురువారం నాడు వారి ఇంటికి వెళ్లి రూ.రూ.లక్ష నగదు అందజేశారు. శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా త్వరలో చెల్లిస్తామని నరేష్ శరణ్యకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement