Monday, April 29, 2024

PM MODI: ఇవాళ తెలంగాణ‌లో మోడీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారం, రోడ్‌షోలు

తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబాబాద్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించనున్నారు. అలాగే హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు.

ఉదయం తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి హకీంపేట్‌కు నరేంద్రమోడీ చేరుకుంటారు. హకీంపేట్ మోడీ మహబూబాబాద్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం సభలో పాల్గొంటారు.మహబూబాబాద్‌ నుంచి బయలుదేరి మోడీ కరీంనగర్ చేరుకోనున్నారు. కరీంనగర్ సభలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం మోడీ హైదరాబాద్ విమానాశ్రయనికి చేరుకోనున్నారు. సాయంత్రం హైదరాబాద్ రోడ్డు షోలో మోడీ పాల్గొంటారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల రోడ్ షోలో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తూ ముందుకు సాగుతారు. రోడ్ షో తర్వాత గురుపౌర్ణమి సందర్భంగా అమీర్‌పేట్‌లోని గురుద్వారాలో నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement