Thursday, May 2, 2024

TS | పీజీ డెంటల్‌ తొలివిడత ప్రవేశాలు.. 19 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎండీఎస్‌ సీట్ల భర్తీకి ఈనెల 17 నుండి 19 వరకు మొదటి విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటివిడత వెబ్‌ ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని పీజీ డెంటల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈనెల 17న గురువారం నుంచి 19న శనివార ం సాయంత్రం 4 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, మెరిట్‌ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటి వెబ్‌సైట్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement