Monday, April 29, 2024

TS | కుళ్లిన తినుబండారాలు విక్రయిస్తున్న కేరళ బేకరీ సీజ్

మోత్కూర్, (ప్రభ న్యూస్): కుళ్లిన తినుబండారాలను విక్రయిస్తున్న కేరళ బేకరీని అధికారులు సీజ్​ చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ఇవ్వాల (గురువారం) జరిగింది. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం.. పోతాయగడ్డలో కుళ్ళిపోయిన తినుబండారాలను విక్రయిస్తున్న టేస్టీ కేరళ బేకరీని పరిశీలించిన అధికారులు, సిబ్బంది ఆ తర్వాత బేకరీ ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. టేస్టీ కేరళ బేకరీలో బూజు పట్టిన బ్రెడ్, కేక్ లు విక్రయిస్తున్నారని కార్యాలయ దృష్టికి రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించామన్నారు.

ఆ తర్వాత షాప్ ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టణంలో ఎవరైనా కుళ్ళిపోయిన వస్తువులు,తినుబండారాలు విక్రయించినట్లయితే సదరు దుకాణాల లైసెన్స్ లు రద్దుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమములో మున్సిపల్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, బయ్యని.మోహన్ రావ్, బీసు.శాంతి కుమార్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement