Friday, May 3, 2024

RR: దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పెన్షన్లు… మంత్రి మల్లారెడ్డి

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 23: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు అందజేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో అర్హులైన 6,461 మంది దివ్యాంగులకు ప్రభుత్వం రూ.4,016 చొప్పున పెంచిన ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి మల్లారెడ్డి బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు జరిగేలా చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లాలో దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016లకు పెంచిన ఆసరా పెన్షన్ల ప్రొసీడింగ్స్ ను మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన 6,461 మంది దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రూ.4,016 లను ప్రొసీడింగ్ లను మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

జిల్లాలో వివిధ రకాల పెన్షన్లు పొందుతున్న మొత్తం లబ్ధిదారులు 1,46,922 మంది ఉన్నారని, వీరికి ప్రతినెలా రూ.39 కోట్ల 63 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగులకు మేడ్చల్ నియోజకవర్గంలో గతంలో రూ.3,016 చొప్పున రూ.1,94,88,376 పంపిణీ చేయగా, ప్రస్తుతం ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచగా నియోజకవర్గంలో రూ.2,59,47,832 అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,863 మంది దివ్యాంగులకు రూ.3,016 పింఛన్ అందించిన సమయంలో రూ.6,59,38,808 చెల్లిస్తుండగా, ప్రస్తుతం ప్రభుత్వం రూ.4,016 ల చొప్పున ప్రతినెలా దివ్యాంగులకు రూ.2,18,63,000లు చెల్లించాల్సి వస్తుందన్నారు. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా రూ.8,78,01,808 అందచేయాల్సి ఉంటుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు.


దివ్యాంగులు ఎంతో ఆత్మస్థైర్యం, ధైర్యం కలిగి ఉంటారని, ప్రభుత్వం తరపున దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువేనని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇల్లు లేని దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, వారికి మొదటి ప్రాధాన్యత కింద అలాట్ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, దమ్మాయిగూడ, ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్ పర్సన్లు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement