Saturday, May 11, 2024

గులాబీ మయమైన పెద్దపల్లి.. సీఎం కేసీఆర్ ను స్వాగితిస్తూ హోర్డింగులు

పెద్దపల్లి జిల్లా గులాబీ మాయమయింది. రాజీవ్ రహదారి మొత్తం స్వాగత తోరణాలతో నిండిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రానికి సోమవారం రానుండడంతో అభిమాన నేతను స్వాగతిస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్ద ఎత్తున హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బెలూన్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించడానికి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుండటంతో సీఎం కెసిఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్​ఎస్​ శ్రేణులు సిద్ధమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement