Monday, April 29, 2024

Peddapalli – చెక్ డ్యాంను డిటోనేటర్ లు, జిలిటిన్ స్టిక్స్ తో కూల్చేందుకు కుట్ర..

పెద్దపల్లి – పరారుచెక్ డ్యాం కూల్చేందుకు ప్రయత్నించిన సంఘటన పెద్దపల్లి జిల్లా లో సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి పెద్దపల్లి మండలం బోజన్నపేట, కొత్తపల్లి మధ్యలో హుస్సేన్ మియా వాగు పై నిర్మించిన చెక్ డ్యాం ను గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్ తో పాటు డ్రిల్లింగ్ మెషిన్ తీసుకువచ్చి డిటోనేటర్ లు, జీలిటిన్ స్టిక్స్ తో పేల్చేందుకు ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు వెళ్లడం తో దుండగులు పారిపోయారు.

చెక్ డ్యాం నిర్మాణం వల్ల కిందకు నీరు రావడం లేదని, దానిని పేల్చేందుకు ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలం లో డిటోనేటర్ లు,జిలిటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement