Friday, May 17, 2024

పన్నులు చెల్లించండి.. అభివృద్ధికి సహకరించండి

పెద్ద‌ప‌ల్లి పట్టణ ప్రజలంతా పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ తిరుపతికి ఆస్తిపన్ను కోసం 10,80,405 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని ప్రజలందరూ ఈ నెల 31వ తేదీ లోగా ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement