Thursday, April 25, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న. ఎంపీ రవిచంద్ర

పుట్టినరోజు సందర్భంగా కేబీఆర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటారు ఎంపీ రవిచంద్ర.
పర్యావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం, నాటించడం, వాటిని పరిరక్షించడం అత్యవసరం చెప్పారు. రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మొక్కల్ని నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల్ని నాటే,నాటించే,వాటి పరిరక్షించడాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు.ఈవిధంగా ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించిన,వాటిని పరిరక్షిస్తున్న సంతోష్ కుమార్ అభినందనీయులని రవిచంద్ర అన్నారు.మొక్కల్ని నాటే కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజుతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్,కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు,మున్నూరుకాపు ప్రముఖులు కొండా దేవయ్య, సర్థార్ పుట్టం పురుషోత్తంరావు,ఆవుల రామారావు,ఉరుమడ్ల నర్సింహా,ఊసా రఘు,గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రముఖులు,అటవీ శాఖ సిబ్బంది ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement