Sunday, April 28, 2024

Accident | పంజాగుట్ట చౌరస్తాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట చౌర‌స్తాలో ఘోరం జ‌రిగింది. ఆర్టీసీ బ‌స్సు ఢీకొని ఓ మ‌హిళ చ‌నిపోయిన ఘ‌ట‌న ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి చోటుచేసుకుంది. బోరబండకు చెందిన రమ్య ఎర్రమంజిలోని ఓ సంస్థలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది. పంజాగుట్ట చౌరస్తాలో దిగిన ఆమె ఎర్ర మంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్ర‌మంలో జగదిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడికక్కడే చ‌నిపోయింది. రమ్యకు ఇద్దరు ఆడపిల్లలున్నారు, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. మృతురాలి భర్త అనారోగ్యంతో ఇంటివద్ద ఉంటుండ‌గా కుటుంబ పోషణ మొత్తం రమ్యనే చూసుకుంటుందని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement