Sunday, May 19, 2024

Pandaripuram Tour – రెండు బ‌స్సులు, 600 కార్ల భారీ కాన్వాయ్ తో మ‌హారాష్ట్ర‌కు కెసిఆర్ ప‌య‌నం – వీడియోలతో

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో బయలుదేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఒమర్గాకు చేరుకుంటారు. ఒమర్గాలో మధ్యాహ్న భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4.30కి షోలాపూర్‌ బయలుదేరుతారు. రాత్రి అక్క‌డే బస చేస్తారు. మంగళవారం ఉదయం 8 గంటలకు షోలాపూర్‌ నుంచి పండరీపురం చేరుకుంటారు.

పండరీపురంలోని విఠోభారుక్మిణి మందిర్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సభలోనే సోలాపూర్‌ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి ధారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు పయనమవుతారు. సీఎం కేసీఆర్‌ పర్యటనకు మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement