Wednesday, May 1, 2024

కళ్లు మూసుకొని నిరసన తెల్పిన పంచాయతీ కార్మికులు


మోత్కూర్, జూలై 23 (ప్రభ న్యూస్)మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో భాగంగా ఆదివారం18వ రోజు తమ చేతులతో కళ్ళు మూసుకొని వినూతనంగా నిరసన తెలిపారు.గత 18 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు

. ఈ సందర్భంగా సంఘము మండల అధ్యక్షులు సూరారం నాగయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది ని పర్మినెంట్ చేయాలని, 60వ జి ఓ ను అమలు చేయాలని, ప్రమాదం జరిగి మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, సిబ్బందికి పి ఎఫ్,ఈ ఎస్ ఐ, ప్రమాద బీమా ,గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు

.ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు జె బంగారి, మల్లేష్, పి .సైదులు,ఎస్ బుచ్చయ్య,ఎస్ లక్ష్మీ, ఆర్ స్వామి,కె ఎల్లమ్మ,వి సుదర్శన్,కె అంజయ్య,ఎం. కృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement