Friday, May 3, 2024

ADB: ఏసీబీకి పట్టుబడ్డ పంచాయతీరాజ్ ఏఈ, కార్యదర్శి..

బెల్లంపల్లి, జనవరి 10 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పంచాయతీరాజ్ ఏఈ, కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెరికపల్లి గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల కోసం బిల్ చేయడానికి బెల్లంపల్లిలో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ ఏఈ పరంజ్యోతి, పెరకపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వీరబాబులు రూ.15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డి.ఎస్.పి వై రమేష్ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement