Friday, May 3, 2024

ఉస్మానియా వ‌ర్శిటీ మాజీ విసి న‌వ‌నీత‌రావు క‌న్నుమూత‌..

హైద‌రాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ మాజీ వీసీ డాక్ట‌ర్ న‌వనీత రావు క‌న్నుమూశారు. 1985-91 మ‌ధ్య ఓయూ వైస్ ఛాన్స్‌ల‌ర్‌గా న‌వనీత‌రావు ప‌ని చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప‌బ్లిక్ ఎంట‌ర్‌ప్రైజ్ డైరెక్ట‌ర్‌గా కూడా సేవ‌లందించారు న‌వ‌నీత రావు. డాక్ట‌ర్ న‌వీన‌త రావు మృతిప‌ట్ల ఓయూ ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు నివాళుల‌ర్పించారు.

న‌వ‌నీత‌రావు మృతి ప‌ట్ల బీఆర్ఎస్ నాయ‌కులు దాసోజు శ్ర‌వ‌ణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. న‌వనీత రావు డైన‌మిక్ అడ్మినిస్ట్రేట‌ర్ అని ఆయ‌న కొనియాడారు. ఓయూ గౌర‌వాన్ని పెంచ‌డ‌మే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాల‌ను కూడా తీర్చిదిద్దార‌ని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప‌రిపాల‌న‌లో రాజ‌కీయ జోక్యాల‌కు తావు ఇవ్వ‌కుండా, స్వ‌యం ప్ర‌తిప‌త్తిని కొన‌సాగించార‌ని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం త‌న‌కు ద‌క్కింద‌ని శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. న‌వనీత రావు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని శ్ర‌వ‌ణ్ ప్రార్థించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement