Monday, April 29, 2024

గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట – సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ కన్నుమూత

ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం ఏర్పడింది..ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ ఆవరణకు చేరుకుంది. అయితే.. చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది.

ఈ తోపులాటలో గద్దర్‌కు అ‍త్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి చెందారు.గద్దర్‌ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్‌ ఉర్దూ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

.సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్‌. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్‌ అంత్యక్రియలకు హాజరై.. ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్‌ అరెస్ట్‌తోనే జహీరుద్దీన్‌ మృతి చెందినట్లు తెలిపారు

- Advertisement -

ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement