Sunday, May 5, 2024

Suryapet: విద్యుత్ షాక్ తో ఒకరు మృతి

మోతె, జులై 27(ప్రభ న్యూస్) : సూర్యాపేట మోతె మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామానికి చెందిన అరిగే వెంకటేశ్వర్లు ముదిరాజ్ (30) మేకలను మేపేందుకు గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో మండలు కొడుతున్న క్రమంలో అక్కడే ఉన్న ఫెన్సింగ్ వైర్ పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు, గ్రామస్తులు తెలిపారు.

విషయం తెలుసుకున్న మోతె పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు భార్య రమణ ఫిర్యాదు మేరకు మోతె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement